కొత్తపేటలో ప్రమాదకరంగా వంగిన విద్యుత్ స్తంభం|

0
0

కిర్లంపూడి, కిర్లంపూడి మండలం జగపతినగరం పంచాయతీ పరిధిలో కొత్తపేటకు చెందిన ఇండ్ల సముదాయం మధ్యలో విద్యుత్ స్తంభం వంగి ప్రమాదకరంగా ఉందని స్థానిక కాలనీవాసులు భయాందోళన వ్యక్తపరుస్తున్నారు, ప్రస్తుతం వర్షాకాలం కావడంతో విపరీతమైన గాలులు వచ్చినప్పుడు ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని అధికారులు చొరవ తీసుకొని వెంటనే అప్రమత్తమై ముందుగానే నూతన విద్యుత్ స్తంభం మార్చి రానున్న ప్రమాదాల నుంచి విముక్తి చేయవలసిందిగా కాలనీ వాసులు మరియు గ్రామస్తులు కోరుతున్నారు.