పుంగనూరులో ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్ర|

0
0

చిత్తూరు జిల్లా పుంగనూరులో సోమవారం చత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భారత యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘భారత్ మాతాకీ జై, చత్రపతి శివాజీ మహారాజ్ కి జై’ నినాదాలతో పురవీధులు మారుమోగాయి. మహిషాసుర మర్దిని, కోలాటాలు, డీజేలతో పెద్ద సంఖ్యలో హిందువులు ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణ పురవీధులను కాషాయపు జెండాలతో అలంకరించారు. ఈ ఆధ్యాత్మిక హైందవ కార్యక్రమానికి పోలీసుల గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు

#కొత్తూరు మురళి.