అన్నా క్యాంటీన్ మనందరిది… పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత!
దర్శి పట్టణం, కురిచేడు రోడ్లోని అన్నా క్యాంటీన్ను సందర్శించిన దర్శి టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు భోజనం నాణ్యత, పరిశుభ్రత, నిర్వహణను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం నిరుపేదలకు కేవలం ₹5కే పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, నాణ్యమైన భోజనం అందించడాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుందని తెలిపారు.
ప్రభుత్వం కల్పించిన ఈ సేవను ప్రతి ఒక్కరూ బాధ్యతతో వినియోగించుకోవాలని, భోజనం చేసిన తర్వాత మిగిలిన ఆహారాన్ని నేలపై వేయకుండా చెత్తబుట్టల్లో వేయాలని, అన్నా క్యాంటీన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి అందరికీ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పిద్దామని పిలుపునిచ్చారు.










