ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, లోక్సభ మాజీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం గారి ఆకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శాసనసభ్యుడిగా, లోక్సభ సభ్యుడిగానే కాకుండా ప్రజా నాయకుడిగా సమస్యల పరిష్కారంలో ముందుండి పోరాడారని కొనియాడారు.
ముద్రగడ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ముఖ్యమంత్రి గారు తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు.










