రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు రూ.54 వేల విరాళం|

0
3

రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు రూ.54 వేల విరాళం

‎ వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆలయ అభివృద్ధి, విస్తరణ పనుల కోసం అమెరికాలో నివసిస్తూ హనుమకొండకు చెందిన చామల చందన–వివేకానంద్ కుటుంబ సభ్యులు రూ.54,000 విరాళంగా అందజేశారు.

‎ఈ విరాళాన్ని ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ స్వీకరించి, దేవస్థానం తరఫున దాత కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

‎అనంతరం దాత కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వచనం అందజేసి, స్వామివారి శేషవస్త్రం, లడ్డు ప్రసాదం, తీర్థ ప్రసాదాలను అందించి ఆశీర్వదించారు