జ్వరంతో గిరిజన విద్యార్థి మృతి|

0
0

సాలూరు (M) ఎగువమెండంగికు చెందిన గిరిజన విద్యార్థి జయంత్ జ్వరంతో అస్వస్థతకు గురై గురువారం మృతి చెందాడు. విద్యార్థి తండ్రి దనేల్ తెలిపిన వివరాల మేరకు.. 3 రోజులుగా జ్వరంతో బాధపడుతూ కాళ్లు చేతులు కదపలేని స్థితికి చేరుకున్నాడని, ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మృతి చెందాడన్నారు. ఇటీవల 10 ఫలితాలలో 503 మార్కులు సాధించాడన్నారు.మంచి భవిష్యత్తు ఉన్న విద్యార్థికి ఇలా జరగడంతో అందరూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

#Boiena Rajesh