తడి, పొడి చెత్తను వేర్వేరుగా ఇవ్వాలి|

0
0

ఇళ్లలో తడి, పొడి చెత్తను వేరు చేసి గ్రీన్ అంబాసిడర్లకు ఇవ్వాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలం కృష్ణాపురంలో శుక్రవారం చెత్త సేకరణపై మహిళలకు అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయకుండా గ్రీన్ అంబాసిడర్లకు ఇవ్వాలన్నారు. ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ చేయకపోతే పిర్యాదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

#Boiena Rajesh