Madanapalle: పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ మదనపల్లె మున్సిపల్ కమిషనర్కు మున్సిపల్ అధ్యక్షుడు ముజీబ్ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ముజీబ్ మాట్లాడుతూ, పట్టణంలోని పలు వార్డుల్లో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
నీటి కొరత నివారణకు తక్షణ చర్యలు చేపట్టి, ప్రతి వార్డుకు సక్రమంగా తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ను కోరారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీటి సరఫరాను మెరుగుపరిచి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










