ఆసిఫాబాద్‌లో ఈ నెల 22న మినీ జాబ్ మేళా: ఉపాధి అధికారి|

0
81

ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్):కుమారం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించేందుకు ఈ నెల 22న (బుధవారం) ఉదయం 10:30 గంటలకు మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి కిరణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జనకపూర్ లోని MPDO ఆఫీస్ పక్కన ఉన్న టాస్క్ సెంటర్ (TASK Center) లో ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ ‘ఫోన్‌పే ప్రైవేట్ లిమిటెడ్’ (Phonepe PVT LTD) లో గల 15 బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఈ మేళా నిర్వహిస్తున్నారు. ఇంటర్మీడియట్ అర్హత కలిగి, 18 నుండి 25 సంవత్సరాల వయస్సు ఉన్న మహిళలు మరియు పురుషులు (M/F) ఈ ఉద్యోగాలకు అర్హులు. అభ్యర్థుల వద్ద సొంత బైక్ మరియు 4G/5G స్మార్ట్‌ఫోన్ తప్పనిసరిగా ఉండాలి.ఎంపికైన వారు ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, సిర్పూర్, వాంకిడి, కెరమెరి, బెజ్జూర్, కౌటాల ప్రాంతాలలో పని చేయాల్సి ఉంటుందని, వీరికి నెలకు ₹18,000 నుండి ₹25,000 వరకు జీతం లభిస్తుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డ్ మరియు బయోడేటా (Resume) లతో ఇంటర్వ్యూకి హాజరుకావాలని కోరారు. పూర్తి వివరాల కోసం 7989733351, 9160608476 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని ఆయన స్పష్టం చేశారు.