ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూర్ ITDA సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎల్-నినో ( EL-NINO) ప్రభావ తీవ్రత తగ్గించేందుకు ప్రత్యామ్నాయ కార్యచరణ ప్రణాళిక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,
ఈసందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ రైతులను ఆదుకుంటాంమని తెలిపారు,ఎల్ -నినో వల్ల ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను అధిగమించి రైతులను ఆదుకుని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు,ఎల్ -నినో ప్రభావంతో నీటి కొరత, రైతుల ప్రయోజనాలను ఎలా కాపాడాలనే అంశంపై చర్చించారు. ఈసందర్బంగా నీటి కొరత, పంటలపై రైతులను చైతన్యం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు.. మున్సిపాలిటీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు,పార్టీలకు అతీతంగా రైతులకు మనం అందరూ సహకరించాలి చెప్పారు,ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్పెషల్ ఆఫీసర్ కె. ఇళంబరితి, ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బోజ్జు పటేల్ , మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, అన్నీ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు , తదితరులు పాల్గొన్నారు,









