జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌పై హైకోర్టులో పిటిషన్.|

0
13

● వార్డుల పునర్విభజన చట్టవిరుద్ధమని ఆరోపణ.

● విచారణ ఆగస్టు 11కు వాయిదా.

హైదరాబాద్, జులై 20 : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

వార్డుల సరిహద్దులను నిబంధనల ప్రకారం తిరిగి నిర్ధారించే వరకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్లు కోర్టును కోరారు.

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వార్డుల పునర్విభజన చట్టవిరుద్ధంగా జరిగిందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

1996 జీవో నంబర్ 570లోని రూల్-5 ప్రకారం డీలిమిటేషన్ జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుని నిర్వహించాల్సి ఉండగా, ఆ నిబంధనలను పాటించలేదని వాదించారు.

అలాగే తెలంగాణ మున్సిపాలిటీస్ చట్టం–2019లోని సెక్షన్-6 నిబంధనలను కూడా ఉల్లంఘించినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ప్రభుత్వం, పిటిషనర్ల తరఫు వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు తదుపరి విచారణను ఆగస్టు 11కు వాయిదా వేసింది.

#Sidhumaroju