● నిర్మాణానికి కేంద్రం నుంచి రూ.34 కోట్ల మంజూరు
● ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక ముందడుగు
● ఎంపీ ఈటల రాజేందర్ చొరవతో ప్రాజెక్టుకు ఊతం
మేడ్చల్ మల్కాజిగిరి జూలై 23: మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని గౌతమ్ నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి (RUB) నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.34 కోట్ల నిధులు మంజూరు చేసింది.
ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏళ్లుగా వాహనదారులు, స్థానిక ప్రజలను ఇబ్బంది పెడుతున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది.
ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా పూర్తిగా కేంద్రం నుంచే నిధులు సమకూరనున్నాయి. దీంతో రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు ప్రాంతీయ మౌలిక వసతులు బలోపేతం కానున్నాయి.
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కేంద్ర మంత్రులు, రైల్వే శాఖ ఉన్నతాధికారులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించి ప్రాజెక్టు ఆమోదానికి కృషి చేసినట్లు పార్టీ విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.
గౌతమ్ నగర్ ప్రజలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
#sidhumaroju
Alwal










