విద్యార్థుల డిజిటల్ విద్యకు స్మార్ట్ టీవీ బహూకరణ|

0
1

మహబూబాబాద్,
మహబూబాబాద్ మండలంలోని ఎంపీపీఎస్ హనుమంతునిగూడెం పాఠశాల విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం కీర్తిశేషులు బండి ఎలేంద్ర, బిక్షపతి కుమారుడు బండి శ్రీనివాస్ తన తల్లిదండ్రుల స్మారకార్థం రూ.25 వేల విలువైన స్మార్ట్ టీవీని పాఠశాలకు బహూకరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలాజీ కుమార్ మాట్లాడుతూ, డిజిటల్ యుగంలో విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన బోధన అత్యంత అవసరమని అన్నారు. పేద, వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు నాణ్యమైన డిజిటల్ విద్యను అందుకునేందుకు ఈ స్మార్ట్ టీవీ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.

విద్య పట్ల సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి పాఠశాలకు స్మార్ట్ టీవీని అందించిన శ్రీ బండి శ్రీనివాస్ సేవాభావం, దాతృత్వాన్ని ఆయన కొనియాడారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కిరణ్ కుమార్, శంకర్, సాయికుమార్, శిరీష పాల్గొని దాతకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం సమాజంలోని దాతలు ఇలాంటి సేవా కార్యక్రమాలకు మరింతగా ముందుకు రావాలని ఆకాంక్షించారు.