ఎమ్మిగనూరులోని ఆర్&బీ అతిథి గృహంలో నిర్వహించిన|

0
0

ఎమ్మిగనూరులోని ఆర్&బీ అతిథి గృహంలో నిర్వహించిన అంగన్‌వాడీ కార్యకర్తలకు నూతన ఇండక్షన్ స్టవ్‌లు మరియు వంట సామగ్రి పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

వారి సేవలను గుర్తించిన కూటమి ప్రభుత్వం అంగన్‌వాడీ కార్యకర్తల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ గ్రాట్యుటీ అమలు చేయడంతో పాటు, వివిధ సంక్షేమ చర్యలను అందుబాటులోకి తీసుకువస్తోందని తెలిపాను.

అంగన్‌వాడీ కార్యకర్తలు తల్లులు, చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం మరియు బాలల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు,భవిష్యత్తులో కూడా అంగన్‌వాడీ కార్యకర్తల సంక్షేమం, పని పరిస్థితుల మెరుగుదల కోసం ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చాను