● కమిషనర్ రంగనాథ్పై తీవ్ర వ్యాఖ్యలు
● సీనియర్ అధికారిని జైల్లో పెట్టాలా? అంటూ ప్రశ్నించిన ధర్మాసనం
● ఆఫీసర్గా నియమించాలా.. కమిషనర్గా కొనసాగించాలా అని వ్యాఖ్య
మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 27: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. లోతుకుంట చెరువు భూముల వ్యవహారానికి సంబంధించిన విచారణలో రంగనాథ్ వ్యవహారశైలిని ధర్మాసనం తప్పుబట్టింది.
63 కోట్ల విలువైన భూమి వివాదానికి సంబంధించిన కేసును విచారించిన హైకోర్టు, సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్న వ్యక్తి చట్టానికి అనుగుణంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది.
అవసరమైతే ఇలాంటి అధికారులను జైలుకు పంపాల్సి వస్తుందని ధర్మాసనం వ్యాఖ్యానించినట్లు సమాచారం.
అంతేకాదు, ఇలాంటి కలిగిన అధికారిని కమిషనర్గా కొనసాగించాలా అనే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించాలని హైకోర్టు సూచించినట్లు వెల్లడైంది.
#Sidhumaroju
Alwal










