● వివాహ వార్షికోత్సవం సందర్భంగా అభిమానుల అభినందనలు
● పార్టీ శ్రేణులు, రాజకీయ ప్రముఖుల శుభాకాంక్షలు
● ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షలు
మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 28: మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఈటల రాజేందర్–జమునమ్మ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ దంపతులకు అభినందనలు తెలియజేస్తున్నారు.
తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన ఈటల రాజేందర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ, తెలంగాణ ఏర్పాటుకు అనంతరమూ ప్రజా ప్రతినిధిగా వివిధ బాధ్యతలు నిర్వహించారు.
ప్రస్తుతం మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా ప్రజా జీవితంలో కొనసాగుతున్న ఆయనకు జమునమ్మ అండగా నిలిచారని పలువురు పేర్కొంటున్నారు.
అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా నిలిచిన ఈ దంపతులు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ పలువురు రాజకీయ ప్రముఖులు, పార్టీ నాయకులు, అభిమానులు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
#Sidhumaroju
Alwal










