పెద్దపల్లి : చెట్టును ఢీకొన్న కారు

0
1

ఎర్రగుంట్లపల్లి గ్రామ శివారులో గురువారం కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ధర్మారం మండలం కేంద్రంలోని వడ్డెర కాలనీకి చెందిన ముగ్గురు యువకులు కారులో కరీంనగర్ వెళ్తుండగా, ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఘటన స్థలానికి చేరుకొని గాయపడిన ఇద్దరినీ ధర్మారం ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్ కు తరలించారు.