నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి నివాళి|

0
2

,​మహబూబాబాద్: కొత్తగూడ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆకస్మిక మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.​ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి, అశ్రునయనాలతో నివాళులర్పించారు. “ప్రజల కోసం, కార్యకర్తల కోసం నిరంతరం పరితపించే గొప్ప నేతను కోల్పోవడం తీరని లోటు” అంటూ నాయకులు కన్నీటి పర్యూమమయ్యారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ అధ్యక్షులు కొమ్మనబోయిన వేణు, నెహ్రూ నాయక్ బానోత్, మాజీ ఎంపిటిసి ననుబోతుల లింగన్న, వెంకటేష్, మాజీ సర్పంచ్ భూపతి తిరుపతి, బానోత్ వీరన్న, అజ్మీర రవి,సురేష్,ఈసం నరేష్,తక్కలపల్లి దేవేందర్రావు,ఆవుల రమేష్, జిమ్మిడి శ్రీనివాస్,లంకలపల్లి శ్రీను,ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.