● 2019లో మూసివేసిన రౌడీషీట్ పునరుద్ధరణ
● జూబ్లీహిల్స్, మేడిపల్లి పరిధుల్లో బెదిరింపుల ఆరోపణలు
● ఇటీవల నమోదైన కేసుల నేపథ్యంలో అంబర్పేట పోలీసుల చర్య.
అల్వాల్, సెప్టెంబర్ 15: హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అంబర్పేట పోలీస్స్టేషన్ పోలీసులు అంబర్పేట శంకర్పై మళ్లీ రౌడీషీట్ ఓపెన్ చేశారు.
గతంలో శంకర్పై కొనసాగిన రౌడీషీట్ను 2019లో పోలీసులు మూసివేశారు. తాజాగా ఆయనపై పలు కేసులు నమోదైన నేపథ్యంలో రౌడీషీట్ను పునరుద్ధరించారు.
బిల్డర్లను బెదిరించడం, సెటిల్మెంట్ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారనే ఆరోపణలు శంకర్పై ఉన్నాయి.
ఇటీవల బిల్డర్ జి. అంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో శంకర్తో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదైంది. సెటిల్మెంట్ వ్యవహారంలో తమకు అనుకూలంగా వ్యవహరించాలని ఒత్తిడి చేసి, కుటుంబ సభ్యులను చంపుతామని బెదిరించినట్లు ఫిర్యాదులో ఆరోపించారు.
ఇదే క్రమంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్, మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధుల్లోనూ శంకర్పై బెదిరింపులకు సంబంధించిన ఆరోపణలు నమోదయ్యాయి.
గత జూన్లో గాజులరామారంలో ప్లాట్ల విక్రయానికి సంబంధించిన వ్యవహారంలోనూ ఆయనపై కేసు నమోదైనట్లు తాజా వివరాలు వెల్లడిస్తున్నాయి.
ఈ వరుస కేసుల నేపథ్యంలో అంబర్పేట పోలీసులు గతంలో మూసివేసిన రౌడీషీట్ను తిరిగి తెరిచారు. దీంతో శంకర్ కార్యకలాపాలపై పోలీసులు నిఘా కొనసాగించనున్నారు.
#Sidhumaroju
Alwal










