🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్,: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు జిల్లా క్రీడా పాఠశాలకు విచ్చేసిన సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ITDA) ప్రాజెక్ట్ అధికారి గౌరవ శ్రీ మంద మకరందు గారిని ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు గారు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా వారు ఆసిఫాబాద్ నియోజకవర్గము లోని మారుమూల ప్రాంతాల అభివృద్ధి గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన తీవ్రంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తుల గురించి పీఓ గారి దృష్టికి తీసుకెళ్లారు. దాంతో పాటుగా మంగి, పంగిడి మాదోర, గోపన, కోటాగం గ్రామాలకు సంబంధించిన సెల్ సిగ్నల్స్ సమస్యలను వివరించారు. అలాగే స్థానిక విద్యార్థులకు, యువతకు ఎంతో ప్రయోజనకరమైన కుమురం భీమ్ స్టడీ సర్కిల్ పునఃప్రారంభం గురించి క్షుణ్ణంగా వివరించి, వీటన్నింటిపై ఒక వినతి పత్రమును సమర్పించడం జరిగింది.ఈ సందర్భంగా గౌరవ పీఓ గారు సానుకూలంగా స్పందిస్తూ. నియోజకవర్గంలోని అన్ని సమస్యల పరిష్కారం కొరకు ప్రత్యేకంగా కృషి చేస్తానని హామీ ఇస్తూ, కుమురం భీం స్టడీ సర్కిల్ ని స్వయంగా సందర్శించడం జరిగింది.










