ఆసిఫాబాద్ హమారా ప్రసాద్ దిష్టిబొమ్మ దహనం.. తీవ్ర నిరసన వ్యక్తం చేసిన సెంటర్ కమిటీ సభ్యులు

0
3

ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ ప్రతినిధి): భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గురువారం నాడు స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద సెంటర్ కమిటీ సభ్యులు భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా హమారా ప్రసాద్ అనే వ్యక్తి అంబేద్కర్ గారిని అవమానించేలా, ఆయన ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడటంపై నిరసనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన దిష్టిబొమ్మను రోడ్డుపై దహనం చేసి తమ నిరసనను తెలియజేశారు.దేశానికి దిశానిర్దేశం చేసిన మహోన్నత వ్యక్తిపై ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం సరికాదని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడిన హమారా ప్రసాద్‌పై వెంటనే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఆయనను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా వారు గట్టిగా డిమాండ్ చేశారు.