ముఖ్య అతిథిగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి. ఘనంగా నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమం|

0
23

ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నెహ్రూ యువ కేంద్రం, మరియు తెలంగాణ గిరిజన సంక్షేమ నివాస మహిళా డిగ్రీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆసిఫాబాద్ శాసనసభ్యురాలు శ్రీమతి కోవ లక్ష్మి గారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.అభివృద్ధి చెందిన భారతదేశం సాకారం కావాలంటే యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆమె పేర్కొన్నారు. మద్యం, డ్రగ్స్, తంబాకు వంటి అలవాట్లు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని, విద్యార్థులు చదువునే తమ నిజమైన నషాగా (వ్యసనంగా) మార్చుకోవాలని పిలుపునిచ్చారు. చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో చురుగ్గా పాల్గొనాలని కోరుతు గిరిజన బాలికల విద్యకు తన వంతు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆసిఫాబాద్ డీఎస్పీ శ్రీ అశోక్, డీఆర్‌పీ శ్రీ రాథోడ్ నరేష్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి డి. శారద, మరియు బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ రవికుమార్ గారు పాల్గొని విద్యార్థులకు మార్గదర్శనం చేశారు.