సంతకం నకిలీ.. ఎన్‌ఓసీ గల్లీ..!|

0
8

● HYDRAA కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు

● ఇంటర్ బోర్డు అనుమతుల కోసం నకిలీ ఫైర్ ఎన్‌ఓసీలు సమర్పించినట్లు ఫిర్యాదు

● ఎనిమిది ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై కేసు నమోదు.. దర్యాప్తు ప్రారంభం

హైదరాబాద్, ఆగస్టు 5: ఇంటర్మీడియట్ బోర్డు అనుమతులు పొందేందుకు HYDRAA కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఫైర్ ఎన్‌ఓసీ (No Objection Certificate) పత్రాలు సమర్పించినట్లు వెలుగులోకి రావడంతో సంచలనం రేగింది.

ఈ వ్యవహారంపై HYDRAA అదనపు డైరెక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎనిమిది ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

HYDRAA నిర్వహించిన ప్రాథమిక పరిశీలనలో 76 ఫైర్ ఎన్‌ఓసీ పత్రాలను పరిశీలించగా, వాటిలో ఎనిమిది కాలేజీలు సమర్పించిన పత్రాల్లో కమిషనర్ సంతకం నకిలీగా ఉన్నట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

ఈ పత్రాలను ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించి అనుమతులు పొందేందుకు ప్రయత్నించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఫిర్యాదు మేరకు లేక్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు, నకిలీ పత్రాల తయారీ, వాటి వినియోగం వెనుక ఉన్న వ్యక్తులు, సంబంధిత సంస్థల పాత్రపై దర్యాప్తు చేపట్టారు. ఇదే తరహాలో సమర్పించిన ఇతర పత్రాలనూ అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

#Sidhumaroju