అభివృద్ధి చేయగానే ఓట్లు వేయరు: మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి|

0
0

ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. అభివృద్ధి చేస్తే ప్రజలు గెలిపిస్తారా? వారి సమస్యలు తీరిస్తే ఓట్లు వేస్తారా? అనే అంశంపై తన రాజకీయ అనుభవాన్ని రంగరించి ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. అభివృద్ధి చేసినంత మాత్రాన ఎన్నికల్లో గెలుస్తామనుకోవడం పొరపాటని, ఓట్లు మానవ సంబంధాలపై ఆధారపడి ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. తన సొంత నియోజకవర్గంలో ఎదురైన ఒక సంఘటనను ఉదాహరణగా చూపుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

 

తన సొంత నియోజకవర్గమైన పీలేరులోని ‘మంచాలమంద’ అనే మారుమూల గ్రామం గురించి కిరణ్ కుమార్ రెడ్డి వివరించారు. “ఆ గ్రామానికి 9 కిలోమీటర్ల వరకు సరైన రోడ్డు ఉండేది కాదు. 1989లో ఎమ్మెల్యే అయినా, 2002 వరకు నేను ఆ ఊరికి వెళ్లలేకపోయాను. దాదాపు 800-900 ఓట్లున్న ఆ గ్రామానికి కాలినడకన వెళ్లాల్సి వచ్చేది. అక్కడ ప్రజలకు సరైన ఇళ్లు, సాగునీటి వసతులు కూడా లేవు” అని నాటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారు.

 

2004లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ గ్రామంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు ఆయన తెలిపారు. “ఆ ఒక్క గ్రామానికే 500 ఇళ్లు మంజూరు చేశాం. 4 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా రెండు చెక్‌డ్యామ్‌లు నిర్మించాం. కోటి రూపాయల ఖర్చుతో 9 కిలోమీటర్ల రోడ్డు వేశాం. దీంతో గ్రామానికి బస్సు సౌకర్యం కూడా వచ్చింది. అంతేకాకుండా, ఎంపీపీ పదవిని కూడా ఆ గ్రామస్థులకే ఇచ్చాం” అని తాను చేసిన అభివృద్ధి పనులను వివరించారు.