విశాఖలో యాక్సిడెంట్.. విజయనగరం వాసి మృతి|

0
1

విశాఖలోని ఆదర్శనగర్ హైవేపై మంగళవారం ఉదయం ప్రమాదం జరిగింది. వాల్తేరు జంక్షన్ నుంచి హనుమంతవాక వైపు వెళ్తున్న TVSను అదే మార్గంలో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విజయనగరం (D), గుర్ల (M) కలవచర్ల గ్రామానికి చెందిన గుమ్మడి సూర్యనారాయణ చనిపోయారు. చేపలు కొనుగోలు చేయడానికి గుర్ల నుంచి ఫిషింగ్ హార్బర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆరిలోవ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని KGHకు తరలించారు.

#Rajesh