నర్సంపేట: విద్యుత్ షాక్తో యువకుడి మృతి
భారత్ అవాజ్ న్యూస్: వరంగల్ జిల్లా నర్సంపేట్ మండలంలోని ఎల్లయ్య గూడెంకు చెందిన బోడ శివ విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే కుటుంబసభ్యులు, స్థానికులు హుటాహుటిన నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. శివ మృతితో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వృత్తిరీత్యా శివ విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము.,










