యాదాద్రికి దీటుగా వేములవాడ అభివృద్ధి.. కాంగ్రెస్ ప్రగల్భాలు|

0
2

యాదాద్రికి దీటుగా నిర్మాణం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రగల్భాలు..

‎సిమెంట్.. కాంక్రీట్ తో నిర్మాణాలు.. బయట పడుతున్న లోపాలు.

‎దిగజారుతున్న ఆలయ ప్రతిష్ట.. ప్రాశస్థ్యత..

‎చుట్టూ కట్టడాలతో కనిపించకుండా పోతున్న ప్రధాన గర్భాలయ గోపురం.

ఆలస్యంగా గుర్తించి ఆలోచనలోపడ్డ అధికారులు..

తప్పును కప్పిపుచ్చుకునేందుకు విస్తరణ పేరిట తెరపైకి కొత్త ప్రతిపాదనలు.

‎ఏకంగా గర్భాలయం ఎత్తుతోపాటు.. విస్తరించడానికి కొత్త ప్రతిపాదనలను తెరపైకి తెచ్చినట్టు విశ్వసనీయ సమాచారం.

‎అందుకోసం ఈనెల 12న శృంగేరి పీఠాధిపతిని కలిసేందుకు బృందం వెళ్తున్నట్టు తెలియడం చర్చనీయాంశమైంది.

‎విస్తరణ పనుల్లో ఇష్టారాజ్యంపై భక్తుల తీవ్ర అసంతృప్తి.

‎వీటన్నింటినీ నిశితంగా పరిశీలిస్తే.. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని తెలుస్తుండగా.. ఆలయ నిర్మాణ తీరు భక్తులను ఆందోళనకు గురి చేస్తున్నది.