● 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం
● జాతీయ పతాకావిష్కరణ అనంతరం ఈటల రాజేందర్ కీలక సందేశం
● దేశభక్తి, యువత బాధ్యతపై ప్రస్తావించిన ఎంపీ.
మేడ్చల్-మల్కాజిగిరి, ఆగస్టు 15: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ శామీర్పేట్లోని తన క్యాంప్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించి దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ, ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే మన దేశానికి స్వేచ్ఛ లభించిందని గుర్తుచేశారు. వారి త్యాగస్ఫూర్తిని స్ఫూర్తిగా తీసుకుని దేశ సమగ్రాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు.
స్వాతంత్ర్య ఫలాలను ప్రతి పౌరుడికి అందేలా దేశం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ప్రధానంగా యువత దేశ ప్రగతిలో క్రియాశీలక పాత్ర పోషించాలని, జాతీయ సమైక్యత, దేశభక్తి, సామాజిక బాధ్యతలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరులను స్మరించుకోవడంతో పాటు, వారు కలలు కన్న బలమైన, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో క్యాంప్ కార్యాలయ సిబ్బంది, సీఆర్పీఎఫ్ జవాన్లు, పలువురు నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
#sidhumaroju
Alwal










