నందవరం మండల కేంద్రంలో MPUP స్కూల్ నిర్వహించిన 80స్వాతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఎంఈఓ రఘునాథ్ పాల్గొని జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది .స్కూల్ హెడ్మాస్టర్ MD శ్రీనివాసులు ఆధ్వర్యంలో స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతోమంది దేశ నాయకులు త్యాగాల వల్ల స్వాతంత్రం వచ్చింది.
దేశ భవిష్యత్తు, విద్యార్థులు యువత చేతిలో ఉంటుంది. పేదరికం ,అవినీతి, అసమానత, నిర్మూలించినప్పుడే దేశం బాగుపడుతుంది ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలి అదేవిధంగా దేశ నాయకులు వేషాదరణలో విద్యార్థులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి
మన గ్రామంలోని పిల్లల విద్యాభివృద్ధి కోసం ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని జరగాలని, ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈ కార్యక్రమంలో టిడిపి పిఎస్ డైరెక్టర్ దేవుళ్ళ భీమ శేఖర్, దేవుళ్ళ నాగరాజ్ , సాగు నీటి కాలువ చైర్మన్ వీరేష్, చుక్క రాజు, రాజోలి గజేంద్రనాయుడు, దేవుళ్ళ గోపీనాథ్ , తోట ఈరన్న , రాజోలి మోహన్ , పాఠశాల టీచర్లు దేవపాల్ ,నరసన్న, మహబూబ్ బాషా, నాగరాజ్, ప్రశాంత్, సుబ్బయ్య ,గౌతమి, విజయశాంతి ,విద్యాలక్ష్మి, పద్మావతి ఉపాధ్యాయులకు, విద్యార్థులు పాల్గొనడం జరిగింది.









