పోలీస్ రిక్రూట్మెంట్లో ఆదివాసీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ తుడుందెబ్బ జిల్లా కమిటీ రేపు (బుధవారం) జిల్లావ్యాప్తంగా ఏజెన్సీ బంద్కు పిలుపునిచ్చింది.
తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ బంద్ను విజయవంతం చేయాలని ఆదివాసీ సంఘాలను కోరారు.










