బొబ్బిలి గ్రోత్ సెంటర్లో కాలుష్యాన్ని నివారించాలని ఎమ్మెల్యే బేబినాయన అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు.బుధవారం అమరావతిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం వల్ల ఎం. బూర్జవలస, ఎం. పణుకువలస గ్రామాల్లో భూగర్భ జలాలు కలుషితమై ప్రజలు తాగునీటికోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తక్షణమే కాలుష్యాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
#RAJESH










