ఎమ్మిగనూరు: రైతుల సమస్యల పరిష్కారం, ముఖ్యంగా ఖరీఫ్ సీజన్లో పంటలకు అవసరమైన సాగునీటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో “రైతు పోరుబాట” కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎమ్మిగనూరు నియోజకవర్గ రైతు మిత్రులు, రైతులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.










