ఏపీఎస్పీడీసీఎల్ క్రీడా పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం|

0
0

Madanapalle: ఏపీ ఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో ఆగస్టు 15న నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన ఉద్యోగులకు గురువారం బహుమతులు ప్రదానం చేశారు. ఏపీఎస్పీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గంగాధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు.

 

అన్నమయ్య సర్కిల్ ఏర్పడిన అనంతరం స్పోర్ట్స్ కౌన్సిల్ కార్యదర్శిగా సీనియర్ హాకీ క్రీడాకారుడు గురుభాస్కర్ ఆధ్వర్యంలో ఈ క్రీడా కార్యక్రమాలను నిర్వహించారు. ఉద్యోగుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో క్రికెట్, వాలీబాల్, చెస్, క్యారమ్స్ వంటి పోటీలను పురుషులకు నిర్వహించగా, మహిళలకు చెస్, క్యారమ్స్, షటిల్, టెన్నికాయిట్ పోటీలు నిర్వహించారు.

 

ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాలతో బిజీ షెడ్యూల్ ఉండటంతో విజేతలకు బహుమతుల ప్రదానోత్సవాన్ని గురువారం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఈఈ స్పోర్ట్స్ కౌన్సిల్ తరఫున ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గంగాధర్‌ను ఘనంగా సన్మానించారు.

 

క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను ఈ సందర్భంగా అధికారులు, స్పోర్ట్స్ కౌన్సిల్ సభ్యులు అభినందించారు. ఉద్యోగుల మధ్య స్నేహభావం, ఆరోగ్యకరమైన పోటీ స్ఫూర్తిని పెంపొందించేందుకు భవిష్యత్తులోనూ మరిన్ని క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.