రాజాం మండలం కంచరాంలో కొత్త ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్ ఆదివారం నిర్వహించారు. 18 యేళ్లు నిండిన యువత తమ భవిష్యత్తును ఓటు రూపంలో నిర్ణయించుకోవాలని అధికారులు చెబుతున్నారు. 20 మంది కొత్త ఓటర్లను నమోదు చేసినట్లు వార్డు వెల్ఫేర్ పెంటం నాయుడు తెలిపారు. ఇంకా ఎవరైనా ఓటు హక్కు నమోదుకు చేసుకోకుంటే గ్రామ వార్డు స్వర్ణ గ్రామాన్ని సంప్రదించాలన్నారు.









