ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మ్యాపింగ్ కాని ఓటర్లకు, తప్పుల జాబితాలో ఉన్నవారికి వెంటనే నోటీసులు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. సోమవారం అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఈ నెల 27న అన్ని గ్రామాలు, వార్డుల్లో సభలు పెట్టి ఓటర్ల జాబితాను చదివి వినిపించాలని సూచించారు. దీనిపై స్పందించిన జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్, నోటీసుల జారీకి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.










