Madanapalle: పట్టణంలోని రెడ్డీస్ కాలనీ యోగివేమన నగర్లో చర్చి వద్ద పాడైపోయిన బ్రిడ్జి కారణంగా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వార్డువాసుల సమస్యను 32వ వార్డు అధ్యక్షులు మండిపల్లి (జెసిబి) మధుసూదన్ రెడ్డి గుర్తించారు.
వెంటనే స్పందించి తన సొంత నిధులతో బ్రిడ్జికి మరమ్మతులు చేయించి ప్రజలకు రాకపోకలు సులభతరం చేశారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బంది కలిగించే సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు.
ప్రజల అవసరాలకు అండగా నిలవడమే తన లక్ష్యమని తెలిపారు. సొంత నిధులతో బ్రిడ్జి మరమ్మతులు చేపట్టిన మధుసూదన్ రెడ్డి సేవా దృక్పథాన్ని వార్డువాసులు అభినందించారు.










