మదనపల్లె: అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లె పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధ్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. డాక్టర్ సనత్ రెడ్డి, డాక్టర్ పావని ఆధ్వర్యంలో ప్రారంభమైన ఆసుపత్రికి పలువురు రాజకీయ, సామాజిక ప్రముఖులు హాజరై నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఆసుపత్రి ప్రారంభ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు దేశాయ్ తిప్పారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్వాహకులను అభినందించి, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఆధ్య ఆసుపత్రి కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.










