జీడిమెట్లలో గంజాయి కలకలం.. ఇద్దరి అరెస్ట్.|

0
2

● 11.365 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్

● విశాఖ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా పట్టివేత

● ప్రధాన సరఫరాదారుడి కోసం పోలీసుల గాలింపు

అల్వాల్, ఆగస్టు 30: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జీడిమెట్లలో గంజాయి అక్రమ రవాణా గుట్టురట్టైంది. కుత్బుల్లాపూర్‌ హెచ్‌ఎంటీ జంగిల్‌ ప్రాంతంలోని పాత ప్రభుత్వ కళాశాల సమీపంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు 11.365 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు.

పోలీసులు అరెస్ట్ చేసిన వారిని మారేడుబుడి రాజు (33), సిరాపు హేమ (41)గా గుర్తించారు. వారి వద్ద నుంచి గంజాయితో పాటు రెండు సెల్‌ఫోన్లు, గంజాయి తరలించేందుకు ఉపయోగించిన సంచులను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో రాజు విశాఖపట్నం జిల్లా మాడుగుల నుంచి గంజాయిని హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు తేలింది. నగరంలో గంజాయి విక్రయించేందుకు తరలిస్తున్న క్రమంలో పోలీసులు పట్టుకున్నట్లు వెల్లడైంది.

ఈ వ్యవహారంలో ప్రధాన సరఫరాదారుడిగా అనుమానిస్తున్న బొంపార రమణ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

ఈ ఘటనపై జీడిమెట్ల పోలీసులు ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరికి సరఫరా చేయాల్సి ఉంది, ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు.

#Sidhumaroju

Alwal