మదనపల్లెలో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో జన్మాష్టమి వేడుకలు |

0
1

Madanapalle: మదనపల్లె ప్రెస్‌క్లబ్‌లో బ్రహ్మకుమారి పద్మావతి మాట్లాడుతూ: బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం, మదనపల్లె ఆధ్వర్యంలో రేపు (సెప్టెంబర్ 3) శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

 శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని శ్రీకృష్ణుడి ప్రసాదాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ప్రధానం చేయనున్నట్లు తెలిపారు.

 చిన్నారులు, విద్యార్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని రేపు జరగబోయే కృష్ణాష్టమి వేడుకలను విజయవంతం చేయాలని బ్రహ్మకుమారి పద్మావతి కోరారు. ఈ కార్యక్రమంలో ఉమామహేశ్వరి పాల్గొననున్నట్లు తెలిపారు.