కొమరాడ మండలంలో కొద్ది రోజులుగా ఎనిమిది అడవి ఏనుగుల గుంపు తిష్ట వేసి రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ మేరకు ఆదివారం మండలంలో అంకుల్లవలస పరిసర పొలాలలో సంచరిస్తున్నాయని స్థానిక రైతులు తెలిపారు. ఏనుగుల సంచారంతో పంటలు నాశనం అవ్వడంతో పాటు పొలం పనులు కూడా చేసుకోలేకపోతున్నామన్నారు. దీంతో వ్యవసాయ సాగులో తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోతున్నారు.










