DSF రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, ఆదోని డివిజన్ అధ్యక్షుడు వెంకటేష్ మాట్లాడుతూ
రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (DSF) విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తోంది. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు.తక్షణమే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి. ఫీజు ఫీజు రియంబర్స్మెంట్ ఆలస్యం కలవడం వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులను తక్షణమే పరిష్కరించాలి. సంక్షేమ హాస్టళ్లలోకి విద్యార్థి సంఘాల ప్రవేశాన్ని నిషేధించడం సరైన పద్ధతి కాదు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి.










