Chittoor: ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన చిత్తూరుకు చెందిన మాజీ కార్పొరేటర్ వసంత కుమార్ కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు. వసంత కుమార్ శుభస్వీకరణ కార్యక్రమం సందర్భంగా ఆయన నివాసానికి వెళ్లిన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పార్టీ కోసం వసంత కుమార్ చేసిన సేవలను ఎప్పటికీ మరువబోమని లోకేష్ అన్నారు. వసంత కుమార్ కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు.










