బిక్కవోలు బైబిల్ స్కూల్ గ్రాడ్యుయేట్స్ ఆత్మీయ సమావేశం ఆనందంగా జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ పట్టణంలో బ్రదర్ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో బి బి ఎస్ ఆత్మీయ సమావేశం జరిగింది 25 మంది పాల్గొని న్యూ జనరేషన్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చించి రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్న వారి విషయంలో ఇన్సూరెన్స్ చేయించాలనే ఆలోచనతో యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ వారి సహకారంతో 30 మందికి ఇన్సూరెన్స్ చేయడానికి పూనుకున్నారు అయితే మరి కొంత మందికి అవకాశం కల్పించాలని ఈ నెల 12వ తేదీ వరకు పొడిగించి వివరాలు అందించాలని ప్రెసిడెంట్ గుడివాడ బాబ్జి తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ సెక్రటరీ డేవిడ్ రాజు ట్రెజరర్ నాగేశ్వర రావు వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు బ్రదర్ ఎస్ జోసెఫ్ విజయవాడ, బ్రదర్ రాజబాబు గోకవరం, బ్రదర్ జాకబ్ ఐక్యత గురించి చక్కగా వివరించారు కోరుకొండ మీటింగ్ నిర్వాహకులు బ్రదర్ ఎం. ప్రేమ్ కుమార్ చక్కటి ఏర్పాటు చేశారు.










