వినాయక చవితి మండపాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి

0
15

భారత్ ఆవాజ్ న్యూస్ : నల్లచెరువు వినాయక చవితి  ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని పోలీసు అధికారులు సూచించారు. మండలంలోని గ్రామాల్లో వినాయక విగ్రహ ప్రతిష్ఠ, మండపాల ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని తెలిపారు.మండపాల వద్ద శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. విద్యుత్‌ కనెక్షన్లు.

అగ్నిమాపక భద్రత, ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.ఉత్సవాల సందర్భంగా డీజేలు, అధిక శబ్దం, అసభ్యకర కార్యక్రమాలకు తావులేకుండా నిబంధనలు పాటించాలని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. భక్తులు, నిర్వాహకులు పోలీసులకు సహకరించి వినాయక చవితిని సుఖశాంతులతో జరుపుకోవాలని డీఎస్పీ శివ నారాయణ స్వామి సూచించారు.