🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి): జిల్లాలో విద్యుత్ సేవలను మరింత మెరుగుపరిచేందుకు మరియు వినియోగదారులకు వేగంగా సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు విద్యుత్ శాఖ ఎస్ఈ (SE) ఉత్తమ్ జాడె తెలిపారు. ఆసిఫాబాద్ సర్కిల్లో ప్రతి విద్యుత్ స్తంభానికి ‘యూనిక్ పోల్ నంబరింగ్’ కేటాయించే ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.ఈ ప్రాజెక్టు వివరాలను వెల్లడిస్తూ, ఇప్పటికే 33 కేవీ విద్యుత్ స్తంభాలకు 90 శాతం, అలాగే 11 కేవీ స్తంభాలకు 50 శాతం నంబరింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని ఎస్ఈ వివరించారు.తక్షణ సమస్యల పరిష్కారానికి మార్గం:ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినా లేదా సాంకేతిక సమస్యలు తలెత్తినా. వినియోగదారులు ఆయా పోల్ నంబర్ ఆధారంగా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. దీనివల్ల సమస్య ఎక్కడ ఉందో ఖచ్చితమైన లొకేషన్ను త్వరగా గుర్తించి, వెంటనే సిబ్బందిని అక్కడికి పంపించడానికి వీలవుతుందని పేర్కొన్నారు. ఈ నంబరింగ్ విధానం ద్వారా విద్యుత్ సమస్యలను అత్యంత వేగంగా పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని ఎస్ఈ ఉత్తమ్ జాడె స్పష్టం చేశారు










