Tomorrow banks strike|

0
3

దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 11న దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె నిర్వహించనున్నట్లు ఆలిండియా బ్యాంకు ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ జాతీయ ఛైర్మన్‌ అనిల్‌కుమార్‌ వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌ దేశోద్ధారక భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్‌ ప్రతినిధులు పి.మురళి, ఐ.హరనాథ్, ఎస్‌.సుబ్రహ్మణ్యం, విఠల్‌తో కలిసి మాట్లాడారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను లాభాల బాటలో నడిపిస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా కేంద్రం వివక్ష ప్రదర్శిస్తోందన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఈ నెల 28, 29, 30వ తేదీల్లో మరోసారి సమ్మె చేస్తామని హెచ్చరించారు*