భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి: కదిరి పట్టణంలో గోవులను అక్రమంగా తరలిస్తున్న ఘటనలు నిత్యం జరుగుతున్నా సంబంధిత నిఘా వర్గాలు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గోవుల అక్రమ తరలింపుల వెనుక ఎవరు ఉన్నారు అధికారులకు సమాచారం ఉన్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.ఈ వ్యవహారంపై అధికారులు వెంటనే స్పందించి, అక్రమ రవాణాను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు.అక్రమంగా గోవులను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.రేపటి నుంచి గోవులను అక్రమంగా తరలించే ప్రయత్నాలను అడ్డుకుంటామని స్థానికులు హెచ్చరించారు.










