సత్యసాయి జిల్లా : వర్షాభావంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నందున సత్యసాయి జిల్లాను వెంటనే కరువు జిల్లాగా ప్రకటించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్, రైతు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కమతం కాటమయ్య డిమాండ్ చేశారు.శుక్రవారం పుట్టపర్తి కలెక్టరేట్ ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
రాష్ట్రంలో 98 లక్షల ఎకరాలకు గాను 34 లక్షల ఎకరాల్లో సాగు జరగలేదని, సాగైన పంటలు కూడా వర్షాభావంతో ఎండిపోతున్నాయని నాయకులు తెలిపారు.కరువు మండలాలను గుర్తించి తక్షణ సాయం అందించాలని, పంట రుణాలు మాఫీ చేసి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు, సీపీఐ నేతలు, రైతులు పాల్గొన్నారు.










