ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని గర్భం.. ముగ్గురిపై వేటు |

0
3

పోలవరం జిల్లా అడ్డతీగల మండలంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని గర్భం దాల్చిన ఘటనపై ఏపీ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలితో సహా ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

 ఈ ఘటనపై గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ (డీడీ) రుక్మాండయ్య వివరాలు వెల్లడించారు. పాఠశాల హెచ్ఎం దూడ శాంతమతి, హాస్టల్ వార్డెన్ పల్లాల విజయగంధం, తరగతి ఉపాధ్యాయురాలు కాకూరి లోవమ్మలను సస్పెండ్ చేసినట్లు ఆయన తెలిపారు. సిబ్బంది పర్యవేక్షణ లోపం కారణంగానే ఈ దురదృష్టకర సంఘటన జరిగిందని ప్రాథమికంగా గుర్తించినట్లు చెప్పారు.