మదనపల్లెలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ |

0
4

తాజా వార్తలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు వ్యాపారం లైఫ్ స్టైల్ టెక్నాలజీ స్పెషల్స్ లైవ్ టీవి వ్యవసాయం జ్యోతిష్యం Search LIVE తాజా వార్తలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు వ్యాపారం లైఫ్ స్టైల్ టెక్నాలజీ స్పెషల్స్ కెరీర్ & ఉద్యోగాలు లైవ్ టీవి వ్యవసాయం ఓటీటీ వీడియోలు ఆటోమొబైల్ క్రైమ్ ఆధ్యాత్మికం ఫోటోలు బ్రాండ్ స్పాట్‌లైట్ ప్రెస్ రిలీజ్ Home ఆంధ్రప్రదేశ్చిత్తూరుMadanapalle: మదనపల్లెలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ! Madanapalle: మదనపల్లెలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ! Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఉచిత మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేసిన సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి.

పర్యావరణ పరిరక్షణకు పిలుపు. By Srinivasulu, Madanapalle Published on: 12 Sept 2026 1:13 PM Madanapalle: మదనపల్లెలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ! Select HMTV Now Madanapalle: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ) విగ్రహాలకు బదులుగా మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి ప్రజలకు సూచించారు. కడప కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో శనివారం మదనపల్లె రెడ్డెప్ప నాయుడు కాలనీలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి హాజరై ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సహజమైన మట్టితో, సహజ రంగులతో తయారు చేసిన వినాయక విగ్రహాలను వినియోగించడం ద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుందని తెలిపారు. పీఓపీ విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమయ్యే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే ఉపయోగించి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈఈ సుధా, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.